బావమరదలు రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్ కి చెందిన సుధాకర్, రామంతాపూర్లోని గాంధీనగర్కు చెందిన పాసాల సుష్మిత ఇద్దరూ బావమరదలు అవుతారు. వీరిద్దరికీ పెళ్ళిళ్లు జరిగినా.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇంట్లో తెలిసి మందలించి.. పోలీస్ కేసులు పెట్టినా మరదలు బావ దగ్గరకు వెళ్లిపోయింది.