పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?

మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలలో 10-వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, సత్యసాయి జిల్లా, కదిరి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత తొమ్మిది నెలల ముందు తాగునీటి కోసం స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. 
 
ఆ సమయంలో స్టాఫ్ రూమ్‌లో వున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటనను ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యంపై ఎవ్వరికీ చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న రెడ్డి నాగయ్య పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె నిండు గర్భిణీ అని తేల్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
పురిటి నొప్పులు రావడంతో ఆ బాలికకు అబ్బాయి పుట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు