మంగళగిరి కృష్ణాయపాలెంలో పేకాటరాయుళ్ల అరెస్ట్

ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:18 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పరిధిలోని కృష్ణాయపాలెంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం స్పెషల్ బ్రాంచ్, మంగళగిరి రూరల్ ఎస్.ఐ లోకేష్, సిబ్బంది దాడులు నిర్వహించారు.


ఈ దాడుల్లో ఆవుల శ్రీనివాసరావు నివాసంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 41,620 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు