విశాఖ పట్నంలో ఓ బాలుడి కిడ్నాప్, హత్య సంచలనం సృష్టించింది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలంలో లభించడంతో బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్నంలోని అనకాపల్లి మండలం, గౌరపాలెంలో బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. 24 గంటల కిత్రం గౌరపాలెంకు చెందిన బాలుడు ఉదయ్ స్కూల్కు వెళ్లి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం ఏలేరు కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బాలుడు తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయ్ని గుర్తించారు. కిడ్నాప్ చేసిన ఉదయ్ను దుండగులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి, శనివారం గౌరపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.