పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన రామస్వామి, చాముండేశ్వరిలకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాదిన్నర పాప వున్నారు. రెండు రోజుల క్రితం వారి బాబు హృతిక్ బైట నుంచి వచ్చి ఫ్లాస్కులో వున్న వేడి టీని మంచినీళ్లు అనుకుని గటగటా తాగేసాడు. గొంతు మండిపోవడంతో పెద్దగా ఏడవసాగాడు. గమనించిన తల్లి అతడు టీ తాగినట్లు గమనించి సమీపంలోని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఐతే బాబు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.