సినిమాకు వెళ్దామని నమ్మించి బాలికపై అత్యాచారం... అవమానంతో బాలిక...

సోమవారం, 12 ఆగస్టు 2019 (19:54 IST)
సినిమాకు వెళ్దామని నమ్మించి ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక నిందితుడు బాలుడు కావడం గమనార్హం. ఈ దారుణం జిల్లా కేంద్రమైన వరంగల్ పట్టణంలోని సమ్మయ్య నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సమ్మయ్య నగర్‌కు చెందిన 15 బాలిక తల్లిదండ్రులు కోల్పోయి తన నాన్నమ్మ వద్ద ఆశ్రయం పొందుతూ తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్‌ అనే యువకులతో బాలికకు పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త చాలా చనువుగా మారింది. దీంతో శనివారం బాలిక ఇంటికి వచ్చిన యువకులు.. సినిమాకు వెళ్దాం రమ్మని ఆ బాలికను నమ్మించడంతో ఆ బాలిక బైకు ఎక్కింది. 
 
ఆ తర్వాత పెంబర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బాలికపై సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. వీరితోపాటు మరో బాలుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. అనంతరం ముగ్గురూ పరారయ్యారు.
 
ఆ తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలి వెళ్లిపోయారు. ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని నాన్నమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత తనకు జరిగిన ఘటనను తలుచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు తిరుపతి, ప్రసన్నకుమార్‌ల కోసం గాలిస్తున్నారు. కాగా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు