అనాధనని చెప్పి యువతులను పెళ్ళి చేసుకుంటాడు... వారితో కలిసి బెడ్రూంలో..?

మంగళవారం, 16 జులై 2019 (15:29 IST)
కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించడానికి కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు. కొందరు మోసాలు చేస్తారు. కానీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన ప్రవీణ్ మాత్రం పెళ్ళిని నమ్ముకున్నాడు. యువతులతో స్వీట్‌గా మాట్లాడి వారిని బుట్టలో వేసి వారిని పెళ్ళి చేసుకుని వారితో బెడ్రూంలో అసభ్యకరమైన ఫోటోలు దిగి డబ్బులు గుంజడం ఈ నిత్యపెళ్ళికొడుకు నైజం.
 
ఇలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ప్రవీణ్. భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి గ్రామంలో నివాసముండే ప్రవీణ్ అదే ప్రాంతంలో ఉంటున్న రాజేశ్వరి అనే యువతిని తనకు ఎవరు లేరని చెప్పి వివాహం చేసుకున్నాడు. మే 10వ తేదీన వీరి వివాహం జరిగింది.
 
అనంతరం రాజేశ్వరి పేరుతో మూడు బ్యాంకు ఖాతాలను తెరిపించి ఆమె దగ్గరున్న నగలు తాకట్టు పెట్టి రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకుని జల్సా చేశాడు. అంతేకాదు ఆమె దగ్గరున్న నగదును కూడా కాజేసి ఎంజాయ్ చేశాడు. ప్రవీణ్‌కు అప్పటికే రెండు వివాహాలయ్యాయని, మూడో పెళ్ళి ఎందుకు చేసుకున్నావంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో రాజేశ్వరి ఖంగుతింది. గొడవ జరుగుతున్న క్రమంలో ప్రవీణ్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు పరారీలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు