కన్నతల్లిపై అత్యాచారం.. దారుణ హత్య.. చెల్లెల్ని కూడా...

మంగళవారం, 2 జనవరి 2018 (17:20 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడం మాత్రమే కాదు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
వి.కోట మండలం శివునికుప్పంలో నివాసముంటున్న అరవై ఐదు సంవత్సరాల బెల్లెమ్మకు కుమారుడు సుబ్రమణ్యం, మరో కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బెల్లెమ్మ భర్త చనిపోయాడు. గత కొన్నిరోజులకు ముందు సుబ్రమణ్యం చెల్లెలిపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు సుబ్రమణ్యంను ఊరి నుంచి బహిష్కరించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాడు సుబ్రమణ్యం.
 
తల్లి బెల్లెమ్మతో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వద్దని కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ప్రతిఘటించడంతో రోకలి బండతో కొట్టి చంపేశాడు. స్థానికులు సుబ్రమణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు