టీడీపీ నేతలకు అచ్చెన్నాయుడు హెచ్చరిక

శుక్రవారం, 1 అక్టోబరు 2021 (23:00 IST)
టీడీపీ నేతలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని తప్పుబట్టారు.

ఈ విధమైన పోకడలను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు