శ్రీవారి లడ్డూలో కల్తీ.. ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను: మోహన్ బాబు 

సెల్వి

శనివారం, 21 సెప్టెంబరు 2024 (19:29 IST)
తిరుమల లడ్డూ కల్తీపై టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల క్షేత్రంలో మహాపచారం జరిగిందని.. విషయం తెలిసి శ్రీవారి భక్తుడినైన తాను చింతించానని మోహన్ బాబు అన్నారు. 
 
శ్రీవారి లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
"ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను." అని మంచు మోహన్ బాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు