లడ్డూపై ఉత్కంఠ.. తిరుమలలో మహాశాంతి యాగం - టీటీడీ కీలక నిర్ణయం

సెల్వి

శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:37 IST)
తిరుమల లడ్డూపై ఉత్కంఠ కొనసాగుతుండగా, తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం జరుగనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ శ్యామలరావు నేతృత్వంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించనున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, నలుగురు ఆగమ సలహాదారులు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
అందరూ ఆలయ ప్రసాదాల సమగ్రతను, స్వచ్ఛతను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. తిరుపతి లడ్డూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన నేపథ్యంలో యాగాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు