కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును హౌస్ అరెస్ట్..

శుక్రవారం, 22 మార్చి 2019 (10:14 IST)
విద్యానికేతన్‌ విద్యార్థులకు 2014 నుంచి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. 
 
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటంలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా అంటూ అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు గృహ నిర్బంధం విధించారు. 
 
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోందంటూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత హోదాలో తిరుపతిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం ఉండడంతో మోహన్ బాబు ర్యాలీ అవాంఛనీయ ఘటనలకు దారితీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ర్యాలీని అనుమతించడంలేదు. ఈ క్రమంలో మోహన్ బాబును బయటికి రానివ్వకుండా నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు