ఏపీలో ప్రధాని మోడీ.. లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు

వరుణ్

మంగళవారం, 16 జనవరి 2024 (15:46 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన లేపాక్షి ఆలయానికి వెళ్లి, అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు.
 
ఆ తర్వాత, గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌)ని నిర్మించగా, దీన్ని ప్రధాని మోడీ ప్రధాని ప్రారంభించనున్నారు. 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. 
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు