హర్యానా వర్శిటీ ప్రొఫెసర్ 500 మందిని అలా వేధించాడట.. ప్రధానికి లేఖ

సెల్వి

మంగళవారం, 9 జనవరి 2024 (12:12 IST)
హర్యానా రాష్ట్రం సిర్సావిల్‌లోని సౌత్రీ దేవి లాల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల్లో సుమారు 500 మంది విద్యార్థినులు, ప్రొఫెసర్‌పై లైంగిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోకర్ లాల్ కట్టార్, గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో, ప్రొఫెసర్ విద్యార్థినిని పిలిచి మాట్లాడినప్పుడు, వారిని లైంగికంగా హింసించేవారని తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని.. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనపై దీనిపై పోలీస్ ఈఎస్పీ దీప్తి కార్క్ మాట్లాడుతూ, ప్రొఫెసర్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి ముందు జరిగిన విచారణలో ప్రొఫెసర్‌పై నేరారోపణలు లేవని.. ప్రస్తుత ఆరోపణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు