బుధవారం ఉదయం ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విషయం తెల్సిందే.