అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు:దేవినేని అవినాష్

గురువారం, 2 జులై 2020 (23:38 IST)
గురువారం మున్సిపల్ ఆఫీసులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో జులై 8న జరగబోయే ఇళ్ల పట్టాల, స్ఠలాలు పంపిణీ గురించి జరిగిన సమీక్ష సమావేశంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొనడం జరిగింది.

ఇటీవల అధికారులు విడుదల చేసిన  తూర్పు నియోజకవర్గం లబ్ధిదారుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికీ  ఇళ్ల పట్టాల, స్ఠలాలు పంపిణీ లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలని అవినాష్ కోరారు.

అంతే కాకుండా రోజురోజుకి కరోనా కేసులు అధికం అవుతున్నాయి, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కరోనా భాదితులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి టెస్ట్లులు చేసి కరోనా నియంత్రణ చేయవలసిందిగా కోరడం జరిగింది.

ఈ సమయంలో ప్రజలు అందరు  తప్పని సరిగా మాస్కూలు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించి, తగు జాగ్రతలు తీసుకోవలసింధిగా అవినాష్ గారు  ప్రజలందరికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు