28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సోమవారం, 9 మార్చి 2020 (20:05 IST)
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు