ఏపీ అసెంబ్లీ : తెదేపా సభ్యులపై వేటు పడింది...

మంగళవారం, 23 జులై 2019 (10:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వివిధ అంశాలపై రసవత్తర చర్చ సాగుతోంది. అయితే, టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకుంటున్నారు. దీంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ముగ్గురు తెదేపా సభ్యులపై ఉప సభాపతి కోన రఘుపతి వేటువేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు