అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

సోమవారం, 14 మార్చి 2022 (18:45 IST)
ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల, గోరంట్ల, వీరాంజనేయస్వామిలు ఉన్నారు. 
 
తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ స్పీకర్‌తో వారు వాగ్వాదానికి దిగారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో టీడీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్టు కాదని స్పీకర్ తెలిపారు. వెంటనే టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు