బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా కోడలు అనుమానాస్పద మృతి?!

గురువారం, 28 మే 2020 (22:27 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. ఈయన కోడలు సుహారిక అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతికి గల కారణాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు.
 
ఆమె గురువారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తన మీనాక్షి టవర్స్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన పార్టీలో ఆమె బంధువులు... స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ పార్టీలో ఆమె గంటకు పైగా నృత్యం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఆ వెంటనే ఆమెను రాయదుర్గ్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపు ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆమె మృతదేహాం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంచి, పోస్టుమార్టం చేయనున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కన్నా కోడలు మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు