అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ : ఏపీ సీఎం జగన్

బుధవారం, 3 నవంబరు 2021 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర కేబినెట్ కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది. 
 
ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.
 
కాగా, రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం నవరత్నాల పేరుతో ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పథకాలతో వేలాది మంది లబ్దిపొందుతున్నారు. ఇపుడ్ అగ్రవర్ణ పేదల కోసం ఒక సంక్షేమ శాఖను ప్రవేశపెట్టడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు