నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడింకానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
 
బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్త సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు bieap.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి