ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్ టిక్కెట్లను గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకును కూడా విడుదల చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ.నరసింహ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడు చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
కాగా, తొలుత గ్రూపు 2 మెయిన్స్ పరీక్షను ఈ యేడాది జనవరి 5వ తేదీన నిర్వహించేలా నోటిఫికేషన్ జారీచేసింది. డిసెంబరు 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుకు జనవరి 10, 2024 చివరి తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూపు-2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది.
గ్రూపు-2 మెయిన్స్ పరీకు 92250 మంది అర్హత సాధించగా, ఫలితాలను వెలువడిన తర్వాత మెయిన్స్ పరీక్షలు పలుమార్లు వాయిదాపడ్డాయి. చివరకి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.