పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

బుధవారం, 6 జనవరి 2021 (20:27 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ ‘విలేఖరులు’ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు