నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ద్రోహిగా మిగిలిపోయారు.. బీజేపీ ఫైర్

శనివారం, 14 జులై 2018 (10:19 IST)
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్‌లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని బీజేపీ ఆరోపించింది. 
 
రాష్ట్ర విభజనను అడ్డుకోలేక ఏపీ ప్రజల దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోయారని భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి, సొంత తమ్ముడిని కూడా గెలుపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
 
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు