మార్చి 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ.. ఒకే వేదికపై ఆ ముగ్గురు

సెల్వి

బుధవారం, 13 మార్చి 2024 (16:41 IST)
మార్చి 17న చిలకలూరిపేటలో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ దశాబ్దాల తర్వాత వేదిక పంచుకోనున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు మూడు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగ సభ జరగనుంది. 
 
చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుండి వాకౌట్ చేసినప్పటి నుండి మోదీతో ఎప్పుడూ బహిరంగ వేదికను పంచుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు.
 
యితే దశాబ్దం తర్వాత ముగ్గురు నేతలు బహిరంగ సభ కోసం ఒకే వేదికపైకి రానున్నారు. మార్చి 17 జరిగే ఈ బహిరంగ సభను భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జేఎస్పీలు కృషి చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు