సాయిబుకే పుట్టావా?: షరీఫ్‌పై బొత్స దుర్భాష

గురువారం, 23 జనవరి 2020 (07:39 IST)
రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత తన చాంబర్‌కు తిరిగి వస్తున్న శాసన మండలి చైర్మన్‌ షరీ్‌ఫపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మొత్తం విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా’’ అంటూ బొత్స ఘోరంగా దుర్భాషలాడారు.
 
మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్‌ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు