పెనుకొండలో విషాదం... కారు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఆదివారం, 1 మే 2016 (18:25 IST)
అనంతపురం : అనంతపురం మండలం పెనుకొండలో ఒక కారు ప్రమాదం విషాదాన్ని నింపింది. స్థానిక ఈశ్వర్ రబ్బరు ప్యాక్టరీ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హైవే పెట్రోలియం సిబ్బంది పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు అనంతపురం నుండి బెంగళూరుకు వెళుతుండగా ఈ కారు ప్రమాదం జరిగింది.