చంద్రబాబుపై హత్యానేరం కేసు నమోదు చేయాలి.. నారాయణ

శనివారం, 18 ఏప్రియల్ 2015 (10:55 IST)
జిల్లా శేషాచలం అడవుల్లో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని, అమాయకులు కాల్చి చంపారని  సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ,  పోలీసులు కూలీలను చంపేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
 
అలాగే ఎన్కౌంటర్ను సమర్థిస్తూ మాట్లాడిన అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. ఎన్కౌంటర్ మీద ఇతర రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఆయన ఎస్టీ కమిషన్ ను కలసి సంఘటన వివరాలను తెలియజేశారు. 
 

వెబ్దునియా పై చదవండి