జిల్లా శేషాచలం అడవుల్లో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని, అమాయకులు కాల్చి చంపారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, పోలీసులు కూలీలను చంపేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.