కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరిన సీఎం... నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.