సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడు... పట్టాభి ఫైర్

మంగళవారం, 16 నవంబరు 2021 (16:01 IST)
వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య కేసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందకు వందశాతం కారకుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే… ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించాలని అని డిమాండ్ చేశారు.
 
ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవాలని పట్టాభి కోరారు. ఈ కేసులో నిందితులను తొందరగా తేల్చకుండా.. అధికారులను మార్చుతూ… సీబీఐ విచారణను ఆపాలంటూ సీఎం జగన్ అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పరోక్షంగా తన సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడని నిప్పులు చెరిగారు. చట్టానికి అందరూ సమానులే అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు