చంద్రన్న సాధన దీక్షకు మద్దతుగా తమ్ముళ్లు

మంగళవారం, 29 జూన్ 2021 (15:08 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన   సాధన దీక్షకు మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ శ్రీ పులివర్తి నాని గారు పిలుపు మేరకు టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వంపై నిరసన తెలిపారు.

చంద్రగిరి మండలం నారావారిపల్లిలో  కందులవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహంకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంకు  తిరుపతి రూరల్, రామచంద్రా పురం, పాకాల, చంద్రగిరి, ఎర్రావారి పాళెం, చిన్నగొట్టిగల్లు,  మండలాల నుంచి ఒకరిద్దరు హాజరైన పార్టీ నేతలు  నిరసన తెలిపారు.

కరోనా సమయం కావటంతో అతి తక్కువ మందికి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా  నేతలు మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షలు, ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి 25 లక్షల  పరిహారం చెల్లించాలని, కరోనా కష్టకాలంలో తెల్లరేషన్ కార్డు కలిగిన పేదవారికి మరియు ఆదాయం కోల్పోయిన వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు