సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలపకపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. తమ అభ్యర్థిని బరిలో దింపింది.
కాగా, తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను బరిలో నిలుపగా, వైకాపా పోటీకి దూరంగా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దించింది.