ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:15 IST)
అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొత్తాన్ని కొంతమంది అవినీతి అధికారులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఎసిబి పాత్ర అభినందించదగ్గ విషయమన్నారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మరోసారి ఆందోళన బాట పట్టనున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వం భూములు ఇచ్చిన నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అక్టోబర్ 5, 16, 17 తేదీల్లో అమరావతిలో భారీ ధర్నా చేపడతామని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు