డబ్బుల కోసం బెదిరింపులు.. యువతులతో పరిచయం.. ఆపై ఫోటోలు తీసి..

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (10:00 IST)
డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మాదాపూర్‌‌కు చెందిన ద్వారకానాథ్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని యువతులను అతడు బ్లాక్ మెయిల్ చేశాడు. 
 
యువతులను రహస్యంగా ఫోటోలు తీసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. డబ్బుల కోసం వేధించాడు. ఇప్పటికే పెద్ద మొత్తాన్ని ఆ యువతుల నుంచి తీసుకున్న ద్వారకానాథ్ వేధింపులు తాళలేక యువతులు బాంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు