దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్

ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:03 IST)
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకచిహ్నంగా మారుస్తామని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్మారక చిహ్నం కోసం రూ.కోటితో నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
 
దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని తెలిపారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. దామోదరం సంజీవయ్య సేవలకు గుర్తుగా చిహ్నం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆ ఇంటి ఫొటోలను పవన్‌ పోస్ట్‌ చేశారు. సంజీవయ్య అత్యంత పేదరికంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు బీజాలు వేశారని.. సీఎంగా రెండేళ్లే ఉన్నా ఎన్నో పనులు చేశారని చెప్పారు. 
 
హైదరాబాద్‌ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్‌ గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు