పెళ్లయిన నెలకే కాటేసిన కరోనా.. తెలుగు జర్నలిస్టు మృతి

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. 
 
జీ సంస్థలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన సిద్ధిఖి మహమ్మద్‌ (29) రాంమనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారం క్రితం ఆయనకు కరోనా సోకడంతో నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
 
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రమై పరిస్థితి విషమించడంలో ఆయనను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చేర్చిన కొద్ది గంటల్లోనే సిద్ధిఖి ప్రాణాలు విడిచారు. ఆస్పత్రి సిబ్బందే అంత్యక్రియలను పూర్తిచేశారు. విజయవాడకు చెందిన సిద్ధిఖీకి నెల రోజుల క్రితమే వివాహమైంది. ఆయన భార్య, తల్లి కూడా కరోనాతో బాధపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు