అంగారక గ్రహం విశ్వకిరణాలను ప్రసరించే అవకాశం ఉందని.. అందుచేత ఈ రోజు (బుధవారం) రాత్రి 12.30 నుంచి 3.30 దాకా సెల్ ఫోన్లను తల దగ్గర పెట్టుకోవద్దని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంగారక గ్రహం నుంచి ఎక్కువ మోతాదులో భూమి మీదకు విశ్వకిరణాలు ప్రసరించే అవకాశం ఉందని.. వీలైనంత దూరంలో సెల్ ఫోన్లను దూరంగా ఉంచండి.
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఈ వదంతులు బాగా ఎక్కువగా వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కానీ, ఇవన్నీ వట్టి వదంతులేనని వీటిలో కొంచెం కూడా నిజం లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కావాలనే కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దంటున్నారు.