వరలక్ష్మిదేవి అలంకారంలో దుర్గమ్మ

శుక్రవారం, 31 జులై 2020 (08:42 IST)
శ్రావణ మాసం రెండవ శుక్రవారం, వరలక్ష్మీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మహిళలు నేడు శ్రావణ-వరలక్ష్మి వ్రతం ఆచరించనున్నారు.

ఉదయం 8 గంటలకు దేవస్ధానం ఆధ్వర్యంలో వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.

వరలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజ్యసబ సభ్యులు మోపిదేవి వెంకట‌రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు