తూగో జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం...

గురువారం, 5 మార్చి 2020 (08:13 IST)
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరంతా ఆ యువతి స్నేహితుడి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది. 
 
ఇద్దరూ కలిసి సంగంపుంత కాలనీ వద్ద ఉన్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు అక్కడికి చేరుకుని, యువతి స్నేహితుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయంపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు