తెల్లని కుర్తా.. నల్లని ప్యాంటులో శాంతి దూతలా జగన్ నయా లుక్.. అదిరిపోయింది గురూ...!!

వరుణ్

మంగళవారం, 2 జులై 2024 (14:02 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. తెల్లని కుర్తా, నల్లని ఫ్యాంటు ధరించి కనిపించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... పులివెందుల నుంచి తొలుత హైదరాబాద్‌కు అక్కడ నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంటులో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగుళూరులోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్‌కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇపుడీ ఫోటోలు సామాజికమాద్యమంలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు.. జగన్‌ను ఈ విధంగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ ఓ శాంతిదూతలా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు