సోమవారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్షులు, చెట్లు, ఔషధమొక్కలు అడవికి నిప్పు పెట్టడంతో సమూలంగా నాశనమవుతున్నాయని అన్నారు. దీంతో ప్రత్యేకంగా రక్షణ కోసం 145 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. వీరు జూన్ 2015 వరకూ పని చేస్తారని చెప్పారు.