పవిత్ర కార్తీకం.. కళ్లు తెరిచిన లక్ష్మీదేవి.. ఎక్కడో తెలుసా? (video)

మంగళవారం, 22 నవంబరు 2022 (15:13 IST)
Godess Lakshmi Devi
పవిత్ర కార్తీక మాసం వేళ తూర్పుగోదావరి జిలాల్లో వింత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది.
 
నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం చూసి అందరూ షాకయ్యారు. 
 


 
ఈ వార్త వైరల్ కావడంతో భక్తులు ఆ వింతను చూసేందుకు ఎగబడ్డారు. ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు