ప్రియుడితో షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం

సెల్వి

శనివారం, 1 జూన్ 2024 (17:25 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని అలా షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం జరిగింది. ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంటను బెదిరించి యువకుడిని బంధించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హోంగార్డు. 
 
ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. గ్రామ శివారుకు వెళ్లిన వారిని చూసిన హోంగార్డ్ రాజ్ కుమార్.. పోలీసు వాహనంతో వెళ్లి స్టేషన్‌కు రావాలని బెదిరించాడు. దీంతో వదిలేయని ప్రాధేయపడిన ఆ ప్రేమ జంట వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. 
 
వారు తమ వద్దనున్న డబ్బులు ఇవ్వడంతో తీసుకున్న రాజ్‌కుమార్‌ ఆపై యువకుడిని బంధించి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు నిన్న దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
నిందితుడు రాజ్‌కుమార్‌ది విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు