కోవిడ్ నుంచి కోలుకున్న తల్లి.... ఇంట్లో అడుగుపెట్టొద్దంటూ కొడుకు హుకుం

శనివారం, 25 జులై 2020 (09:00 IST)
ఆ తల్లి కరోనా వైరస్ బారినపడింది. ఓ ప్రభుత్వ దావఖానాలో చికిత్స తీసుకున్న తర్వాత కోవిడ్ కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక గంపెడాశలతో ఇంటికి వచ్చింది. కానీ, కన్నబిడ్డతో పాటు.. కోడలు ఆమె ఆశలకు బ్రేక్ వేశారు. ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. అంతేనా.. ఏకంగా ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగరులో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక బీజేఆర్ నగర్‌కు చెందిన మహిళ (55)కు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె శుక్రవారం ఇంటికి చేరుకుంది. 
 
మహమ్మారిని జయించి ఇంటికొచ్చిన తల్లిని చూసిన ఆమె కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించకపోగా, ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు, ఇంటిపైకప్పు రేకులను ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొడుకు, కోడలు తీరుతో విస్తుపోయిన ఆమె రాత్రంతా ఇంటి ముందే గడిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు