ఆ హోటల్‌లో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు... ప్రేమజంటలు... 'ఆ' పనిలో...

సోమవారం, 3 జూన్ 2019 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో కొందరు కాలేజీ విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఐటీ కంపెనీల్లో పని చేసే యువతులు విచ్చలవిడిగా అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుకు పట్టుబట్టారు. ఆ ప్రేమ జంటలను చూసిన ఆ విధంగా చూసిన పోలీసులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ తర్వాత వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోయిన్ పల్లి పరిధిలోని తాడ్‌బండ్ చౌరస్తాలో ఓ హోటల్ ఉంది. ఇక్కడకు అనేకమంది కాలేజీ విద్యార్థినీ విద్యార్థులతో పాటు ప్రేమ జంటలు తరచూ వచ్చి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నిఘాలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు వచ్చివెళ్లడం గమనించారు. దీంతో హోటల్‌పై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సోదాల్లో అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు వైద్య, ఇంజనీరీంగ్ కాలేజీలకు చెందిన అమ్మాయిలతో పాటు పలు ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న అమ్మాయిలుగా గుర్తించారు. 
 
వీరిలో చాలామంది అమ్మాయిల వయసు 18 యేళ్ళ నుంచి 25 యేళ్లలోపు ఉన్నట్టు బోయిన్‌పల్లి సీఐ రాజేష్ వెల్లడించారు. వీరంతా హోటల్‌కు ఏ పనిమీద వచ్చారో తెలియదు. హోటల్ సిబ్బంది కూడా సరైన రికార్డును మెయింటైన్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పట్టుబడిన అమ్మాయిలు, అబ్బాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై వదిలివేసినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు