జీవితంపై విరక్తి చెందా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య

బుధవారం, 17 ఆగస్టు 2016 (15:12 IST)
హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీకి 28 యేళ్ళకే జీవితంపై విరక్తి పుట్టింది. ఆ వెంటనే ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారనీ పేర్కొన్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అయితే, చర్లపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ విషయం రామకృష్ణకు పోలీసులు చెప్పారు. దీంతో ఒక్క పరుగున అక్కడకు వెళ్లి చూడగా, అది ప్రవీణ్ కుమార్ మృతదేహంగా సోదరుడు గుర్తించాడు. 
 
జీవితంపై విరక్తి చెందిన తనకు బతకాలని లేదని.. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని.. ఎవరినీ ఇబ్బంది పెట్టొదని దుర్గా ప్రవీణ్‌కుమార్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి