500 సార్లు జైలుకు వెళ్ళ‌డానికి నేను సిద్ధం: నారా లోకేష్

గురువారం, 19 ఆగస్టు 2021 (13:45 IST)
జగన్ రెడ్డి అరాచ‌క పాల‌న‌లో అఘాయిత్యాల‌కు గురైన 500 మంది అక్కాచెల్లెమ్మ‌ల కుటుంబాలకు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ తాను పోరాడ‌తాన‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తెలిపారు. అందుకోసం తాను 500 సార్లు జైలుకు వెళ్ళ‌డానికీ సిద్ధ‌మ‌న్నారు.

నారాలోకేష్ త‌న ట్విట‌ర్ లో ట్వీట్ చేస్తూ, తాను దళిత కుటుంబానికి అండగా నిలబడితే, ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తారా? అదే నా నేర‌మైతే.. ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లతో కేసులు పెట్టుకో.. ద‌ళిత బిడ్డ ర‌మ్య హంత‌కుడిని శిక్షించే వ‌ర‌కూ నా పోరాటం ఆగ‌దు అని స‌వాలు చేశారు.

500 కుటుంబాల‌కీ న్యాయం జ‌రిగే వ‌ర‌కూ 500 సార్ల‌యినా నేను జైలు కెళ్లేందుకు సిద్ధం. మీకు ఇచ్చిన డెడ్ లైన్ కి ఇంకా 18 రోజులే ఉంది. రమ్యని హత్య చేసిన మృగాడికి ఏం శిక్ష వెయ్యబోతున్నారు జగన్ రెడ్డి? అని ప్ర‌శ్నించారు నారా లోకేష్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు