తిరుపతిలో జె.సి.దివాకర్ సంచలన వ్యాఖ్యలు..ఏంటవి..?(video)

బుధవారం, 26 ఏప్రియల్ 2017 (19:33 IST)
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అదే పనిచేశారు. ఏర్పేడు ఘటనలో ఇసుక మాఫియా ప్రమేయంపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా వెరైటీ సమాధానమిచ్చారు. ఇసుక అక్రమ రవాణాలో తాను లేనని, తెలుగుదేశంపార్టీ వారు మాత్రమే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా అని మీడియానే తిరిగి ప్రశ్నించారు.
 
అంతేకాదు అన్ని పార్టీ నేతలు అదే పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏ పార్టీవారైనా ఆ పని చేస్తే తప్పేనంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో జె.సి.పాల్గొన్నారు. ఆయన మాటల్లోనే...

వెబ్దునియా పై చదవండి