ప్రపంచశాంతి కోసం అక్కడ ఆ పని చేస్తున్న కె.ఎ.పాల్, ఏంటది?

శనివారం, 16 నవంబరు 2019 (15:30 IST)
ఈమధ్య డెంగ్యూ జ్వరంతో బాధపడి కాస్త ఊరట చెంది ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కె.ఎ.పాల్. ఎన్నికల ముందు హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తన పార్టీని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికాగా మారుస్తానని తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారు.
 
అయితే ఎన్నికల్లో కె.ఎ.పాల్‌కు వచ్చిన ఓట్లు 281 మాత్రమే. నరసాపురం నుంచి పోటీ చేసిన ఈయనకు వచ్చిన ఓట్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న పాల్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నారట. 
 
అది కూడా అమెరికాలో ఉంటూ. ఇండియాలో ఇక ఉండలేక కె.ఎ.పాల్ అమెరికాలో ఉండిపోయాడట. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఆపడానికి ప్రార్థనలు చేయండి.. జనం ప్రాణాలు కాపాడండి అంటూ కె.ఎ.పాల్ ఒక సెల్ఫీ వీడియో తీసి మరీ పంపించాడట. ఆ వీడియో చూసిన అభిమానులు కె.ఎ.పాల్‌ను సమర్థిస్తే మరికొంతమంది ఎందుకు అమెరికాకు వెళ్ళిపోయావంటూ ప్రశ్నిస్తున్నారట. అమెరికాలోనూ పాల్‌ను ప్రశాంతంగా వుండనివ్వడంలేదట కొందరు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు